చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జనసేన, టీడీపీల పాదయాత్ర

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, ఉమ్మడి నియోజకవర్గ ఇంచార్జ్ లు, యమ్.ఎల్.సీ లు, మాజీ యమ్.ఎల్.సీ లు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం ఎన్.టి.ఆర్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు నాలుగు కాళ్ళ మండపం దగ్గర వరకు పాదయాత్రగా వెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, కార్యదర్శులు ఆనంద్, బాటసారి, జిల్లా సంయుక్త కార్యదర్శి బీగల అరుణ, పట్టణ నాయకులు పార్థు, లక్ష్మి, నగర కార్యదర్శులు కిరణ్ కుమార్, దిలీప్, కిరణ్, పురుషోత్తం, హేమంత్, పురుషోత్తం, సాయి, లోహిత్ రాయల్, వీరమహిల మధులత, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనటం జరిగింది.