అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అయోధ్య రామ మందిర ప్రారంభ వేడుకలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ నెల 22వ తేదీన శ్రీ రామ మందిర ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆహ్వానాన్ని ఆర్.ఎస్.ఎస్., విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు అందించారు. బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆర్.ఎస్.ఎస్. ప్రాంత సంపర్క ప్రముఖ్ శ్రీ ముళ్ళపూడి జగన్ ఆహ్వాన పత్రిక అందచేశారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శ్రీనివాసరెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ శ్రీ పూర్ణ ప్రజ్ఞ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలను తెలిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభించగానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ.30 లక్షలు విరాళాన్ని శ్రీ రామ జన్మ భూమి ట్రస్ట్ కి అందించారు. 2021 జనవరిలో తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులకు విరాళానికి సంబంధించిన చెక్కును అందించిన సంగతి విదితమే.