సమస్యల పరిష్కారం దిశగా రాజంపేట జనసేన

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, ఈదరపల్లి గ్రామ పరిధిలో దైవ కణం నుండి ఈదరపల్లి హరిజనవాడకి వెళ్లే మార్గంలో వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసిన ఇదరపల్లి గ్రామ జనసైనికులు రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు దృష్టికి తీసుకురావడం జరిగింది. యల్లటూరు శ్రీనివాస రాజు సూచన మేరకు సమస్యని పరిక్షించమని సంబంధిత నందలూరు పంచాయితీ సెక్రటరీకి నందలూరు జనసైనికుల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చి సమస్యకి పరిష్కారం చూపమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈదరపల్లి జనసైనికులు మొడపోతుల ప్రవీణ్, పొన్న గణేష్, నరికే హరి, చెడ వరప్రసాద్, మొడపోతుల గణేష్, మేకల శివ. నందలూరు మండల జనసైనికులు పోకూరి మల్లికార్జున, శ్రీను, రమేష్, హరి నందలూరు జనసేన నాయకులు ఆకుల చలపతి, ప్రశాంత్ భారతాల, తిప్పాయపల్లి ప్రశాంత్ పాల్గొన్నారు.