పవన్ కళ్యాణ్ మాటలు వక్రీకరించడం సరికాదు

గాజువాక  నియోజకవర్గం: గాజువాక శ్రీనగర్ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనసేన వీరమహిళలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో వీరమహిళలు మాట్లాడుతూ.. చిత్తశుద్ధి లేని పార్టీ వైసిపి పార్టీ అని, మాటలను వక్రీకరించడం వైసీపీ పార్టీ నాయకులు మాత్రమే చిత్రీకరించగలరని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యవస్థ కోసం ప్రశ్నిస్తే, మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసారని వైకాపా నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని నిందించే ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిదని, అలా ఇలా కాదు అనుకుంటే వీరమహిళల వీరప్రతాం ఏంటో మీకు చూపిస్తామని జనసేన వీరమహిళలు హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగ ప్రశాంతి, లీగల్ సెల్ ప్రతినిధి కళావతి, లంక మురళీ దేవి, షాలిని, జ్యోతి రెడ్డి, లంక లత, మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.