మీ ఓటు నీ ఉపయోగించి సరైన నాయకున్ని ఎంచుకునే బాధ్యత మీదే

  • జనసేన పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో రెండోవ రోజు జనసేన పల్లెపోరు గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడునీ ఎంచుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుందని, ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఎన్నుకున్న వైసీపీ నాయకుడు మంత్రి పదవిలో ఉండి సొంత నియోజకవర్గానికి కనీస నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని గ్రామాల్లో పట్టణాల్లో రోడ్ల దుస్థితి చూస్తే మీకే అర్థమవుతుందని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జనసేన టిడిపి పొత్తుల్లో ప్రభుత్వం ఏర్పడుతుందని తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అవినీతి పై సిబిఐ ఎంక్వైరీ చేస్తానని కడియద్ద గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండదండలు ఉంటాయని గ్రామ అభివృద్ధికి తగిన సహాయం అందిస్తానాని, వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వన్ని గద్దె దించి జనసేన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అనంతరం ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో వేరువేరు ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి బొలిశెట్టి శ్రీనివాస్ 10000 లు చొప్పున రెండు కుటుంబాలకు బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, మరియు కడియద్ద, తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.