జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం సంతోషాన్నిస్తుంది: బత్తుల

  • జనంకోసం జనసేన మహాపాదయాత్ర 49వ రోజు

రాజానగరం: జనంకోసం జనసేన మహాపాదయాత్ర 49వ రోజు భాగంగా కోరుకొండ మండలం, కొత్త మునగాల గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు వివరిస్తూ… జనసేన పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలని, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తూ.. జనసేన కరపత్రాలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పడం మిక్కిలి సంతోషం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల జనసేన ఎంపీటీసీ అభ్యర్థి మండపాక శ్రీను, జంగ తాతారావు, కోళ్ల కృష్ణార్జున నరాల వీరవేంకట సత్యనారాయణ, మండపాక సతీష్, తోట సూరిబాబు, తోట సీతారామస్వామి, సురేష్, పిండి రామోజీ, దాకవరపు బాబ్జి, కోళ్ల పుల్లారావు, మండపాక రామకృష్ణ, నాగా గంగాధర్, మండపాక మునీద్ర, వాసంశెట్టి శ్రీనివాసు, నక్క మణికంఠ, మునగాల గ్రామప్రజలు, జనసేన యూత్ పాల్గొన్నారు.