గవర ప్రసాద్ కు మనోధైర్యాన్నిచ్చిన పెందుర్తి జనసేన

  • వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఆర్ధికసాయం

పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామం, 88 వార్డ్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు 60వ జన్మదిన సందర్భంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో క్యాన్సర్ తో బాధపడుతున్న గవర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి మీకు ఎల్లవేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యం ఇవ్వడంతోపాటు 10 వేల రూపాయలు ఆర్థిక భరోసా నరవ జనసేన పార్టీ తరపున ఇవ్వడం జరిగింది. నరవ జనసేన ప్రతినిధులు మాట్లాడుతూ యవ్వనంలో ఇటువంటి వ్యాధి సోకడం చాలా బాధాకరమని, కుటుంబ సభ్యులు ఇప్పటివరకు వైద్యం కోసం చాలా ఖర్చు పెట్టారు, కావున ట్రస్ట్ సభ్యులు, సంఘాలు, మరియు ఏ ఇతర వ్యక్తులైన స్పందించి మెరుగైన వైద్యంకోసం ఈ కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గల్ల శ్రీనివాస్, వబ్బిన జనార్దన శ్రీకాంత్, రాడి పెంటరావు, ఓమ్మి అప్పలరాజు, గవర రాజు పాల్గొన్నారు.