జగజ్జీవన్ రామ్ జయంతి – జనసేన నివాళులు


కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం బుద్ధ విహార్ వద్ద గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి జయంతి సందర్భంగా జనసేన నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, పురపాలక జనసేన 20వ వార్డు కౌన్సిలర్ తిక్కా సత్య లక్ష్మి, అమలాపురం రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు లింగోలు పండు, తిక్కా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.