జగన్ రెడ్డి.. 2024లో నీ ఓటమి తథ్యం!!

  • కార్వేటినగరం మండల జనసేన అధ్యక్షులు శోభన్ బాబు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కేంద్ర ఉపాధి హామీ పనులు చేసే కూలీలను నీ మీటింగ్ కు రప్పించుకోవడంలోనే నీ అసమర్ధత బయటపడతా ఉంది జగన్ రెడ్డి అని కార్వేటినగరం మండల జనసేన అధ్యక్షులు శోభన్ బాబు ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఉపాధి హామీ కూలీలకు ఈరోజు పని చేయకపోయినా మీకు ప్రజెంట్ వేస్తాం అని చెప్పి మీటింగ్ కి తీసుకెళ్లి విజయవంతం చేసుకోవాలనుకోవడం నీ చేతగానితనానికి నిదర్శనం. నీ పరిపాలనే అంత అద్భుతంగా ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా నీ మీటింగ్ కి రావాలి కదా!. మరి బలవంతంగా కేంద్ర ఉపాధి హామీ పనుల కూలీలను ఎందుకు తీసుకెళ్తున్నట్టు?. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను ఉపయోగించడం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బంది కలుగుతుంది కదా?. చిత్తూరు జిల్లాకు నువ్వు చేసింది శూన్యం, నీవల్ల నీ నాయకులు బాగుపడ్డారే గాని ప్రజలు బాగుపడింది లేదు. మీటింగుకు వచ్చిన ప్రజలందరూ నీ మీద అభిమానంతో వచ్చారనుకోవడం అవివేకం, ఫీల్డ్ అసిస్టెంట్ ల ద్వారా వాళ్ళని బెదిరించి భయపెట్టి సభలకు తీసుకెళ్లారు. ఒకరోజు పని చేయకనే కూలీ డబ్బులు వస్తాయని వచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సభలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా లక్షల్లో ప్రజలు తరలివస్తున్నారు. 2024లో నీ ఓటమి తథ్యం జగన్ రెడ్డి, వారాహి విజయ యాత్ర తరువాత ప్రజల ఆలోచనలో, యువత ఆలోచనలో, మహిళల ఆలోచనలో మార్పు వచ్చింది. ఈ మార్పు నీ పతనానికి నాంది అని శోభన్ బాబు హెచ్చరించారు.