పోలవరం జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు

పోలవరం, జనసేన అద్యక్షులు పవన్‌కళ్యాన్‌ పిలుపు మేరకు జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు సామాజిక పరిశీలనా కార్యక్రమం పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం, పి రాజవరం మరియు పాలచర్ల గ్రామాలలో ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు మరియు నాయకులు కార్యకర్తలు నిర్వహించడం జరిగింది. ఏదైతే స్థలాలు పేదలకు కేటాయించారో ఇక్కడ చెరువులు కుంటలు ఇవ్వడం జరిగిందని ఏస్థలం ఎవరిదో అసలు ఒక ఇల్లు కట్టింది లేదని స్థానిక భాదితులు బోరుమనడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం చేసిందో పోలవరం నియోజకవర్గంలో బయలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల అద్యక్షులు పసుపులేటి రాము,కొయ్యలగూడెం మండల అద్యక్షులు తోట రవి,జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, నియోజకవర్గ ఐటీ కార్యధర్శి ఆటపాకల వెంకటేశ్వరరావు(ఏవి), వీరంకి వెంకటేశ్వరరావు, చోడిపిండి సుభ్రమణ్యం, ప్రగడ రమేష్‌, చిర్రి రాంపండు, తెలగంశెట్టి రాము, డేవిడ్‌ రాజు, కోలా మధు, సూరిశెట్టి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.