టిడ్కో ఇళ్లకు సీఎం జగన్ గ్రహణం పట్టింది: బొలిశెట్టి వంశీకృష్ణ

విజయవాడ సెంట్రల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో బాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నాయకులతో కలిసి జక్కంపూడిలో టిడ్కోఇళ్లను సందర్శించిన సెంట్రల్ నియోజకవర్గం నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ. ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో 12000 మంది పేద ప్రజల సొంత ఇంటి కల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సాకారం కాదు పేదల ఇళ్లను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్న జగన్ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలు జరగవు. వడ్డీలు వాయిదాలు కట్టలేక లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. గడపగడపకు కార్యక్రమంలో మహిళలు ఇళ్ల గురించి మాట్లాడుతుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పూర్తయిన ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు అందజేయాలని జనసేన పార్టీ తరఫున బొలిశెట్టి వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి దాకమరి నాగేష్, పలు డివిజన్ అధ్యక్షులు కెంబూరి కృష్ణ భవాని, నల్లారి సాయి నాగు, యాంపాటి ప్రభు, పైలా ప్రకాష్, భవాని కుమార్ నగర కార్యదర్శులు అలియా బేగం, పాల రజిని, ధార్మిక కమిటీ సభ్యులు సనంపూడి శిరీష, రుద్ర శేఖర్, విన్ను కోట సాయి కృష్ణ, పిల్లా శ్రీకాంత్, బొర్ర రాజు, వాసా అనిల్, హనుమంతు, పోలకి శ్రీనివాస్, చెన్నకేశవుల సత్యం, పోలాకి లక్ష్మీనారాయణ, రామ్ శెట్టి శ్రీధర్, పోలాకి నాగరాజు, శ్రీధర్ మొదలుగుజనసైనికులు పాల్గొన్నారు.