తిరుపతి జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు..

తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం తొండవాడలో గల జగనన్న టిడ్కో ఇళ్ల కాలనీ నందు నీటి సమస్యలు, కరెంటు సమస్యలు, రోడ్ల సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి మరియు ముఖ్య నాయకులతో కలసి ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలను వారికి సమకూర్చాలని జనసేన పార్టీ తరపున ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, బాబ్జి, అకేపాటి సుభాషిణి, వనజ, ఆనంద్, మునస్వామి, పార్థు, ఈశ్వర రాయల్, హేమంత్, మనోజ్, విజయ రెడ్డి, నవ్యా రెడ్డి, సాయి, మణి తదితరులు పాల్గొన్నారు.