అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మెకు జనసేన సంఘీభావం

అల్లూరు జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, చింతూరు ఐ.టి.డి.ఏ ముందు చేపట్టిన నాలుగు మండలాల అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారంతో ఏడవ రోజుకి చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా రంపచోడవరం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం సమన్వయ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి అంగన్వాడీ అక్క చెల్లమ్మలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ ఏడు రోజుల నుండి సమ్మె చేస్తున్నా పట్టించుకోని అధికార ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. తక్షణమే వారి డిమాండ్లని పరిష్కరించాలని వారికి గౌరవ వేతనం పెంచాలని కోరారు. ఈ సందర్బంగా రంపచోడవరం మండల అధ్యక్షులు పాపోలు శ్రీను, అంగన్వాడీ వర్కర్స్ ని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే చింతూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆనందం పెద్ద మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ సేవలు ఎనలేనివి అని వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదని వారు నిలదీశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నాయకులు కొణతం శ్రీనివాస్. చింతూరు చిడుమూరు జనసైనికులు పాల్గొన్నారు.