జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు

పెనుకొండ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆదేశాల మేరకు పెనుగొండ నియోజవర్గం గోరంట్ల మండలంలోని ఎముకలగుట్టపల్లి క్రాస్ దగ్గర జగనన్న కాలనీ సందర్శించి ప్రభుత్వం తీరును ఎండగట్టడం జరిగింది అక్కడ పరిస్థితి చూస్తే స్మశాన వాటిక ఒకవైపు పంచాయితీ చెత్త ఒకవైపు ఉన్నాయి అక్కడకు వెళ్తేనే చెత్త దుర్వాసనతో చాలా అద్వాన్నంగా ఉంది ఇటువంటి చోట మనుషులు నివసించడానికి ఇల్లు ఇచ్చారు అసలు అటువంటి చోట ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని వారు తెలియజేసారు ఇటువంటి చోట ఇళ్ళు ఎందుకు ఇచ్చారో అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, కార్యక్రమాల కమిటీ జిల్లా సభ్యుడు పొగతోట వెంకటేష్, మండల అధ్యక్షుడు సంతోష్, ఐటీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ యోగనందరెడ్డి, నాయకులు అనిల్ కుమార్, నాగేష్, బండారు మల్లికార్జున, వెలమద్ది శ్రీనివాసులు, బాబర్, రాఘవేంద్ర, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.