పితాని ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు

‌ముమ్మిడివరం, జనసేన పార్టీ అధినేత్ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో నిర్వహించు జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 12వ తేది మొదటిరోజు జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యమో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమం పలు ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం మండలం అనంతవరం పంచాయతీ ఎదురుమూడు పుంత 159 సైట్స్ కి సంబంధించి, ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి పంచాయతీ ధనవారిపేట సైట్స్ కి సంబంధించి, ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడి పాలెం పంచాయతీ ఎదురుమూడు పుంత 160 సైట్స్ కి సంబంధించి, ముమ్మిడివరం మండలం పళ్ళవారిపాలెం పంచాయతీ సైట్స్ కి సంబంధించి, ముమ్మిడివరం మండలం లంక అఫ్ తానేలంక పంచాయతీ సైట్స్ కి సంబంధించి, ముమ్మిడివరం మండలం నగర్ పంచాయతీ 20 వార్డ్ 700 ఇళ్ల స్థలాలకి సంబంధించి, కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీ సత్తెమ్మ తల్లి చెట్టు రేవువారిపేట ఇళ్ల స్థలాలకి సంబంధించి, కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీ దొంతుకూరు పెరచెరువు ఇళ్ల స్థలాలకి సంబంధించి, కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీ పల్లంకుర్రు ఇళ్ల స్థలాలకి సంబంధించి, కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీ కొప్పిగుంట ఇళ్ల స్థలాలకి సంబంధించిన ప్రాంతాలలో పర్యటించి టిడ్కో ఇళ్ళను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.