పితాని ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు రెండవరోజు

ముమ్మిడివరం, జనసేన పార్టీ అధినేత్ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో నిర్వహిస్తున్న జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 13వ తేది రెండవరోజు జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమం పలు ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం మండలం తాళ్లరేవు మండలం కమిని పంచాయతీ స్థలాలకి సంబంధించి, ఐ పోలవరం మండలం కమిని సలాదివారిపాలెం పంచాయతీ ఇళ్ల స్థలాలకి సంబంధించి, ఐ పోలవరం మండలం కేశనకూరు పంచాయతీ ఇళ్ల స్థలాలకి సంబంధించి, ఐ పోలవరం మండలం టి. కొత్తపల్లి పంచాయతీ ఇళ్ల స్థలాలకి సంబంధించి, తాళ్లరేవు మండలం నీలపల్లి పంచాయతీ ఇళ్ల స్థలాలకి సంబంధించి, తాళ్లరేవు మండలం రాంజీ నగర్ పంచాయతీ ఇళ్ల స్థలాలకి సంబంధించి, తాళ్లరేవు మండలం చినవలసల పంచాయతీ ఇళ్ల స్థలాలకి సంబంధించి, తాళ్లరేవు మండలం చిన్న బొడ్డువెంకటాయిపాలెం పంచాయతీ ఇళ్ల స్థలాలకి సంబంధించిన ప్రాంతాలలో పర్యటించి టిడ్కో ఇళ్ళను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.