జగన్మోహన్ రెడ్డి తగిన న్యాయం చేయాలి

*జగన్ సర్కార్ కొత్త మంత్రివర్గం కొలువు తీరిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయ్యింది. …

మదనపల్లె, ప్రజలను కాపాడాల్సిన మంత్రులు వారి పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నారు. నిన్న ముక్కు పచ్చలారని ఒక 8 నెలల పసికందు మంత్రి విజయోత్సవ ర్యాలీ వల్ల మరణించింది అంటే మీరు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో అర్దం అవుతుంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా అనుచరులు ర్యాలీ నిర్వహిస్తు, ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేశారు, ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్న ఒక అంబులెన్స్ లోనీ ఒక పసి ప్రాణం అత్యవసర చికిత్స అందక మరణించింది, కనీసం మంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు, మీరు మంత్రి పదవి పొందితే మేము రోడ్ల మీద ఎందుకు ఆగిపోవాలి, పోని రాష్ట్రాన్ని ఉద్ధరించే రాచకార్యానికి ఏమన్నా వెళ్తున్నారా అంటే మీ విజయోత్సవ ర్యాలీ అంట, పసి పిల్లల చావుల మీద విజయత్సవాలు చేసుకుంటున్నారు అన్న విషయం గుర్తు ఉంచుకోండి, పదవులు శాశ్వతం కాదు ప్రజల ప్రాణాలు ముఖ్యం అన్న సంగతి తెలుసుకోండి, తల్లిదండ్రులు కోరినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిపించుకొని తగిన న్యాయం చేయాలి అని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా తరపున గట్టిగా డిమాండ్ చేస్తున్నాను, ఆ తల్లిదండ్రులు చేసే ఎటువంటి పోరాటానికి అయినా జనసేన మద్దతు ఉంటుంది అని తెలియజేస్తున్నానని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.