జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలపై ప్రెస్ మీట్ లు పెట్టాలి: కొట్టే రాజేష్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర అన్నవరం భీమవరం వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగింది. వారాహి యాత్రలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసిపి ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏం చేశారో బహిరంగంగా చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. బటన్ నొక్కడం తప్ప రాష్ట్ర అభివృద్ధి శూన్యం అని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో విమర్శించారు. వైసిపి నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని విమర్శించే ముందు మీ చరిత్ర తెలుసుకొని మనం ఎంతవరకు కరెక్టుగా ఉన్నామా లేదా అని చూసుకుని మాట్లాడాలని, అధికారం శాశ్వతం కాదని, మీ దౌర్జన్యాలను మీ అరాచకలను ప్రజలు గమనిస్తున్నారని ప్రజల సమస్యల మీద ప్రెస్ మీట్ లు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే దానికే ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ మీట్ లు పెట్టడం లేదు అని సిద్ధవటం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో సిద్ధవటం మండల ఇంచార్జ్ కొట్టే రాజేష్ తెలియజేశారు.