ఎన్ని రాజు ఆధ్వర్యంలో జడపేటలో జనసేనాని కోసం జన బాట

జనసేనాని కోసం జనబాట కార్యక్రమంలో భాగంగా రేగిడి ఆముదాలవలస మండలంలోని వెంకట రంగరాయపురం (జాడపేట)లో పర్యటించిన రాజాం నియోజకవర్గం సమన్వయకర్త ఎన్ని రాజుకి గ్రామ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన& టిడిపి మన ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ప్రజలకు మంచి చేకూరాలా విధి విధానాలు ఉంటాయని, గడపగడపకు వెళ్లి జనసేన టిడిపి ఉమ్మడి మేనిఫెస్టో వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జన సైనికులు, జనసేన వీరమహిళలు, టిడిపి పార్టీ నాయకులు, టిడిపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.