కుమారపురంలో దళితవాడలో జనచైతన్యం

పిఠాపురం, తమ జీవితకాలపు వేకువ క్షణాలను, సమ సమాజ నిర్మాణం కోసం, సమాజ చైతన్యం కోసం, ధారపోసిన మహనీయులు అంబేద్కర్, జగ్జీవన్ రామ్, పూలే వారి ఆశయాలకు ఆచరణ రూపం మన జనసేన సిద్ధాంతం. కులాలను కలిపే ఆలోచన విధానం. ఈ సిద్ధాంతమే స్ఫూర్తిగా తీసుకున్న నియోజకవర్గ దళిత నాయకులు జనసేన పార్టీ రూరల్ మండల నాయకులు అయిన వాకపల్లి సూర్య ప్రకాష్ తన తోటి పవన్ కళ్యాణ్ అభిమానులైన చైతన్యవంతమైన దళిత యువతను జనసేన పార్టీ బలోపేతంలో భగం అయ్యేందుకు రేపటి గెలుపులో భాగస్వామ్యం చేసేందుకు సంకల్పించి రూరల్ మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహోన్నత కార్యక్రమం దళితవాడలో జనచైతన్యం మంగళవారం కుమారపురం గ్రామం నందు నిర్వహించడం జరిగినది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కుమారపురం జనసేన నాయకులు అయిన వాసంశెట్టి రాజేశ్వరరావు, తాటికాయలు ప్రసాదు, బావిశెట్టి రామకృష్ణ, సాధనాల రాజా, తాటికాయల సింగయ్య, కుశల గణేష్ ఆధ్వర్యంలో కొనసాగి స్థానిక భీమ్ యువత సహకారంతో విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఘననివాళులు అర్పించిన జనసేన నాయకులు, స్థానిక యువ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందించిన తదనంతరం పవన్ కళ్యాణ్ అభిమానులైన దళిత యువకులతో సమావేశం అయ్యారు. దళిత నాయకులు వేమగిరి ధర్మరాజు, మర్రి రాజు (ఎక్స్ సర్పంచ్), నొక్కు చిరంజీవి, ఈరుగుల నాగేశ్వరరావు, మర్రి సురేంద్ర, బొడ్డు ప్రభాకర్, మర్రి రవి లు పాల్గొన్న ఈ సమావేశంలో రూరల్ మండలం నాయకులు అయిన రామిశెట్టి సూరిబాబు, తమ్మనబోయిన సుదర్శన్ మరియు గెంజి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.