వైసిపి ఎన్నికల ఆయుధం “దొంగ ఓటు”

  • తక్షణమే దొంగ ఓట్లను తొలగించండి – జనసేన డిమాండ్
  • తిరుపతిలో అభినయ్ రెడ్డి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు
  • బిఎల్వోలు ఇక మీ వంతే… జర భద్రం
  • ఆర్డీవో ఆఫీస్ వద్ద ఆందోళనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: తిరుపతి నగరంలో సుమారు నలబైవేల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నాయని శనివారం జనసేన పార్టీ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి, ఆర్డీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి లు మాట్లాడుతూ.. తిరుపతిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని, తక్షణమే వాటిని తొలగించి ఈ నెల 22న విడుదల చేయనున్న ఓటర్ల తుది జాబితాను వాయిదా వేయాలని, దొంగ ఓట్లకు తిరుపతి నిలయంగా మారిందని, కొందరు రాజకీయ నాయకుల మాటలు విని గతంలో దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారులు కొందరిని సస్పెండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండ దయచేసి నిస్వార్ధంగా పనిచేయాలని, ఓటర్ జాబితాను పున పరిశీలించాలని, ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు ఉందని తెలిసినా జనసేన పెద్ద ఎత్తున నిరసనలకు, ధర్నాలకు దిగుతామని ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వారు డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర, వార్డు కమిటీ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు ముఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.