నూతన మండలాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం, మండల అధ్యక్షులుగా ఎన్నికైన నా మిత్రులు బామిని మండలం రుంకు కిరణ్, సీతంపేట మండలానికి చెందిన మందంగి విశ్వనాధం లకు జనసేన జానీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ పదవికి తగు న్యాయం చేసి, పార్టీని మీ మీ మండలంతో పాటుగా నియోజకవర్గంలో కూడా బలోపేతం చేసే దిశగా మీయొక్క ప్రయత్నం ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే పదవిని ఒక బాధ్యతగా భావించి 2024లో జనసేన పార్టీ పాలకొండలో ఎమ్మెల్యే గెలిపిచే విధంగా మీ పాత్ర ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వివిధ నియోజకవర్గాల మండల నాయుకులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా మరియు పాలకొండ నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళల తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అని జనసేన జానీ తెలిపారు.