జట్ల సత్య కుమారికి న్యాయంచేయాలని కోరిన జనసేన

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం జనసేన ఇంచార్జ్ ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామానికి చెందిన జట్ల సత్య కుమారి పీ.ఎస్. ఎన్. మూర్తి టీమ్ ని శనివారం అప్రోచ్ అవడం జరిగింది. విషయంలోనికి రాగా కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామానికి చెందిన సుమారు 42 సంవత్సరాల వయసు గల జట్ల వీర సత్యనారాయణ జూలై 2023న భోజనం చేసి బయటకెళ్ళిన మనిషి ఇంటికి రాకపోవడంతో జూలై నెలలో సత్యనారాయణ భార్య తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ వేయక పోవడంతో మంగళవారం తిమ్మాపురం జనసేన నాయకులు మాదారపు తాతాజీకి ఫోన్ చేసి విషయం తెలపగానే వెంటనే ఆయన తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కి అటెండ్ అయ్యారు. ఇరువురం కలిసి పోలీస్ స్టేషన్లో అడగగా గణేష్ నిమజ్జల్లో కాకినాడ బీచ్ రోడ్ లో ఎస్సై గారు డ్యూటీ ఉండడంవల్ల నేను వచ్చిన వెంటనే ఈరోజే ఎఫ్ఐఆర్ వేస్తానని ఆయన తెలియజేయడం జరిగింది. ఆమెకి న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, టైల్స్ బాబి, కర్రి కాశీ, వై శ్రీనివాస్, పెంకే జగదీష్, తోట సతీష్ కోలా దుర్గ, వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, సూరి కుమారి, పబ్బిరెడ్డి ప్రసాద్ నామ శ్రీకాంత్, మరియు పిఎస్ఎన్ మూర్తి పాల్గొనడం జరిగింది.