కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనం కోసం జనసేన

కూకట్‌పల్లి నియోజకవర్గం: జనం కోసం జనసేన కార్యక్రమం కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి బస్ స్టాప్ నుండి ఆగస్టు 13 ఆదివారం ఉదయం 9.30 గంటల నుండీ ప్రారంభం కానుందని, ఈ పాదయాత్ర కూకట్పల్లి నియోజకవర్గంలో అన్ని డివిజన్లో దశలవారీగా జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, జనసైనికులకు, వీరమహిళలకు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు సూచించారు. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించమని ప్రజలను కోరి తప్పకుండా ప్రజల పక్షాన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు జనసైనికులు, వీరమహిళలు అండగా ఉంటారని తెలియజేస్తామని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ (116) డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ గా గణేష్, వైస్ ప్రెసిడెంట్ లుగా కృష్ణ, రామకృష్ణ, జనరల్ సెక్రెటరీగా సాయిరాం, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గోవిందరావు విజయ ను నియమించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్లు కొల్లా శంకర్, నాగేంద్ర, వేముల మహేష్, వెంకటేశ్వరరావు,తుమ్మల మోహన్ మోహన్ కుమార్, కిషోర్, నాగరాజు డివిజన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు మరియు జనసైనికులు పాల్గొన్నారు.