జనంకోసం జనసేన – పవనన్న కోసం కురుపాం సేన

కురుపాం నియోజకవర్గం, జియమ్మవలస మండలం, జియమ్మ వలస గ్రామంలో జనంకోసం జనసేన – పవనన్న కోసం కురుపాం సేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ మొబైల్ స్టిక్కర్లు మరియు పార్టీ యొక్క సిద్ధాంతాలు జియమ్మవలసలో ఉన్న షాప్ యజమానులకి తెలియజేస్తూ వాళ్లు పడుతున్న ఇబ్బందులు గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన-టిడిపి ఒక ఛాన్స్ ఇవ్వమని జనసేన నాయకులు అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటి కో-ఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్, జియమ్మవలస మండల అధ్యక్షులు వారణాసి శివకుమార్ మరియు జనసేన నాయకులు పోలి నాయుడు, రాజేష్, భార్గవ్, శ్రీనివాస్, రాజశేఖర్, అనిల్, రామకృష్ణ, రమేష్, గౌరు నాయుడు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.