మధురపూడిలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం మంగళవారం కోరుకొండ మండలం, మధురపూడి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకున్న కుటుంబాలను కలిసి వారికి స్వయంగా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మధురపూడి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.