వేముల కార్తీక్ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన

కొత్తగూడెం నియోజకవర్గం: జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎం.జి రోడ్, చిన్న బజార్, పెద్ద బజార్, పాలకేంద్రం ప్రాంతంలో కొత్తగూడెం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వేముల కార్తీక్ పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొత్తగూడెంలో జనసేనకి ఓటు వేసి గెలిపించమని ప్రజల్ని కోరి తప్పకుండా ప్రజల పక్షాన జనసేన అండగా ఉంటుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, ఉపాధ్యక్షులు విజయ్ పాసి, ప్రధాన కార్యదర్శి మారల్లి విజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి అనిత్, సెక్రటరీలు బాలకృష్ణ, రాజు, లక్ష్మీదేవిపల్లి మండలం అధ్యక్షులు మార్గం సందీప్, ఉపాధ్యక్షులు గుర్రం లక్ష్మి, ప్రధాన కార్యదర్శి శివ, చుంచుపల్లి మండల అధ్యక్షులు హతీ రామ్, ఉపాధ్యక్షులు అనిల్, ప్రధాన కార్యదర్శి బి. రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీలు లాలం కల్యాణ్, జేమ్స్ పాల్వంచ మండల అధ్యక్షులు ఓలపల్లి రాంబాబు, ఉపాధ్యక్షులు సంపత్, ప్రధాన కార్యదర్శి దేవా, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలాజీ, సోషల్ మీడియా సెక్రటరీ బాషా సుజాతనగర్ మండల అధ్యక్షులు ఆల్వాల కార్తీక్, జనరల్ సెక్రటరీ కిషోర్, రాకేష్ మరియు జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.