సామాన్యుడికి న్యాయం చేయాలన్న సంకల్పంతో జనసేన జనవాణి

మంత్రాలయం, ప్రభుత్వాన్ని నిలదీసి సామాన్యుడికి న్యాయం చేయాలన్న సంకల్పంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సామాన్యుడి గళం వినిపించేలా జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనని మంత్రాలయం జనసేన పార్టీ తాలూకా నాయకులు పొంత నరసింహులు పేర్కొన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో న్యాయం జరగక సమస్యలతో పోరాడుతున్న వారికోసం జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి 5 ఆదివారాలపాటు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరైనా బాధితులు వారి న్యాయపరమైన సమస్యకు పరిష్కారం ప్రభుత్వం నుంచి దొరకలేదని మౌనంగా ఉండిన వాళ్ళు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో నేరుగా పార్టీ అధ్యక్షులకు అర్జీలను సమర్పించే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. అలాంటి బాధితులు ఎవరైనా మంత్రాలయం నియోజకవర్గంలో ఉంటే మమ్ములను సంప్రదిస్తే నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి అర్జీని సమర్పించుకునేందుకు తగు ఏర్పాట్లను చేస్తామని తెలిపారు. రాయలసీమలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమం జులై 24వ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు.