జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయండి: యు.పి.రాజు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో రేగిడి ఆమదాలవలస మండలం కొండవలస గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో జనసైనికులు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదేవిదంగా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్లె గోవింద్ రావు, ఈశ్వరరావు, మహేష్, రమేష్, సంతోష్ మరియు ఆ గ్రామ క్రియాశీలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.