శ్రీశ్రీశ్రీ పాళ్ళమ్మ అమ్మవారిని దర్శించిన జనసేన నేత చిన్ని

రాజోలు నియోజకవర్గం, ఈదరాడ గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పాళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 7వతేదీ నుండి 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పాళ్ళమ్మ అమ్మవారిని జనసేన నేత యెరుబండి చిన్ని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించిన వారిలో కోకో ఫెడ్ పీఆర్ఓ గారపాటి పండుబాబు, జర్నలిస్ట్ గారపాటి భాగ్యలక్ష్మి మరియు రుద్రా తాతాజీ, నక్కా రామారావు, ముసుకుడి హేమంత్ కుమార్ తదితరులు ఉన్నారు.