పలువురికి పితాని పరామర్శ

ముమ్మిడివరం, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆరోగ్యం బాగోక విశ్రాంతి తీసుకుంటున్న జనసేనపార్టీ నాయకులు ముత్యాల బోస్ ని పరామర్శించారు. అదేవిధంగా జనసేనపార్టీ సీనియర్ నాయకులు గోదశి పుండరీష్ పెదనాన్న స్వర్గీయ గోదశి చిన్నయ్య నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అత్తిలి బాబురావు, సానబోయిన మల్లికార్జునరావు, జక్కంశెట్టి పండు, దూడల స్వామి, సానబోయిన వీరభద్రరావు, కడలి కొండ, పితాని రాజు, రంబాల శంకర్, పెద్దిరెడ్డి సర్వేష్, గొలకోటి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.