సిద్ధాంతం మేరీ కుటుంబాన్ని పరామర్శించిన పిల్లా డాక్టర్ శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఉప్పడ గ్రామం నందు సిధాంతం మేరీ తన కుమారుడు లావరాజు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటికి నిప్పు అంటుకుని మంటలు చెలరేగడం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న వీరిద్దరూ ప్రాణ భయంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన విషయం గురించి తెలుసుకుని త్వరితగతిని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే విధంగా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందంటూ వారి యొక్క కుటుంబ అవసరాల నిమత్తం 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన దొర, వంక కొండబాబు, పలివెల నాని, బాబి, మెరుగు రవి, పల్నాటి మధు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.