జనసైనికుడు శ్యామలరావును పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: నడుకుదురు, తూరంగి గ్రామాల రహదారిపై ఇటీవల జరిగిన బైక్ ఆక్సిడెంట్ లో నడకుదురు గ్రామ జనసైనికులు గంగబత్తుల శ్యామలరావు గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ గంగబత్తుల శ్యామలరావుని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి, అతని ఆరొగ్యపరిస్థితిపై వైద్యులను అడిగితెలుసుకుని, మేరుగైన వైధ్యం అందించాలని కోరారు..