జనసేన కార్యకర్తకు అండగా నిలబడిన జనసేన నాయకులు, కార్యకర్తలు

తిరువూరు నియోజవర్గం, గంపలగూడెం మండలం, కొనిజర్ల గ్రామములో కొనిజర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున (ఎస్సీ) ప్రెసిడెంట్ గా పోటీ చేసిన ఇలవరపు నాగేంద్రమ్మ భర్త ఇటీవల అకాల మరణం చెందినారు. విషయం తెలుసుకున్న తిరువూరు నియోజకవర్గ జనసైనికులు, జిల్లా కార్యవర్గ నాయకులు అందరూ కలిసి చనిపోయిన బాబురావు కుటుంబాన్ని పరామర్శించి 41,000 రూ.ల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడికృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శి ఉట్టి కొండ కృష్ణ, ఎ కొండూరు మండల అధ్యక్షులు లకావత్ విజయ్, తిరువూరు నియోజకవర్గ నాయకులు పడాల లక్ష్మణరావు, ఉయ్యూరు జయప్రకాష్, రవీంద్ర, ఏం పార్టీ యేసయ్యా, గంపలగూడెం మండల ఉపాధ్యక్షులు బర్ల బాలకృష్ణ, జరపాల రామకృష్ణ, కార్యదర్శి రామిశెట్టి శ్రీరామ్, ఓరుగంటి సురేష్, గాదవారిగూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, కోయ రామకృష్ణ, రవి, వెంకటేశ్వరావు, పసుపులేటి మాధవరావు, తిరుపతిరావు, కిషోర్, ముదిగొండ సాయి, పసుపులేటి శ్రీనివాసరావు తదితర జనసైనికులు అందరూ కలిసి విరాళాలు సేకరించి వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉందని వారికి భరోసా కల్పించి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది..