ఉపేంద్రకు అండగా నిలబడిన జనసేన నాయకులు, కార్యకర్తలు

మైలవరం: తిరువూరు నియోజవర్గం, గంపలగూడెం మండలం, గదేవారి గూడెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త చింతలపాటి ఉపేంద్ర గంపలగూడెం నుండి గాడేవారిగూడెం బైక్ మీద ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఉపేంద్ర ను రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పగా.. విషయం తెలుసుకున్న తిరువూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు అతని కుటుంబానికి 12000 రూపాయలు నగదును, 4 వేల రూపాయల విలువచేసే నిత్యావసర సరుకులను గాదవారిగూడెం గ్రామ జనసేనపార్టీ ప్రెసిడెంట్ చెన్నా శ్రీనివాసరావు మరియు జనసేనపార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ చేతుల మీదుగా సరుకులు నగదు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు, గంపలగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శి ఉట్టి కొండ కృష్ణ, ఎ కొండూరు మండల అధ్యక్షులు లకావత్ విజయ్, తిరువూరు నియోజకవర్గ నాయకులు పడాల లక్ష్మణరావు, ఉయ్యూరు జయప్రకాష్, రవీంద్ర, ఏం పార్టీ యేసయ్యా, గంపలగూడెం మండల ఉపాధ్యక్షులు బర్ల బాలకృష్ణ, జరపాల రామకృష్ణ, కార్యదర్శి రామిశెట్టి శ్రీరామ్, ఓరుగంటి సురేష్, గాదవారిగూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, కోయ రామకృష్ణ, రవి, వెంకటేశ్వరావు, పసుపులేటి మాధవరావు, తిరుపతిరావు, కిషోర్, ముదిగొండ సాయి, పసుపులేటి శ్రీనివాసరావు, గంపలగూడెం మండల జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.