గాజు గ్లాసు గుర్తుపై జనసేన నాయకుల హర్షం

రామగుండం: గాజు గ్లాసు గుర్తును మరోసారి జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్రా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీ అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్ పార్టీ అయిన జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషకరం అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల మరియు రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘంలోని అధికారులు మరియు సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.