జనసేనానిపై ఏ.బి.ఎన్ ప్రచురించిన కథనాలను ఖండించిన జనసేన నాయకులు

రాజంపేట: ఏ.బి.ఎన్ రాధాకృష్ణ… ఆర్కే విత్ వీకెండ్ అనే కార్యక్రమం ద్వారా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చి నిధులు గురించి… వారి పత్రికలో మీరు ప్రచురించిన నీచమైన కథనాలను జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య తీవ్రంగా ఖండించారు. రాజంపేట జనసేన కార్యాలయంలో ఏర్పాటు చెసిన మీడియా సమావేసంలో రాటాల రామయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి దుష్ప్రచారాన్ని మేమింకా మర్చిపోలేదు. మీరు మీ రాజకీయ పార్టీకి మంచి చేయడం కోసం జనసేన పార్టీని పావుగా వాడుతామంటే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల, జనసేన పార్టీ పట్ల మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా… వికృత క్రీడలు ఆడినా కేవలం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు వ్యతిరేక ఓటు చీలనివ్వనంటున్నారు. ఏ.బి.ఎన్ రాధాకృష్ణ నిన్ను నీ రాజకీయ పార్టీని కేవలం మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం భరిస్తున్నాం. ఇప్పటికైనా నీ వికృత శ్రేష్టలు, నీచమైన రాతలు మానుకోకపోతే భవిష్యత్తులో నీవు.. నీ రాజకీయ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటాయని రాటాల రామయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య. జనసేన నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, కొండ్లపల్లి హరి, బాల సాయి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.