జనసేన పార్టీ దళిత చైతన్య పోరుబాట

కోడూరు: ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ యువనాయకుడు నగిరిపాటి మహేష్ సంకల్పించిన దళిత చైతన్య పోరుబాట 33వ రోజు కార్యక్రమం కోడూరులోని ఎస్.ఆర్ కాలనీలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కువైట్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేనపార్టీ సిద్ధాంతాలను చేరువ చేయడానికి ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహేష్ ను రైల్వేకోడూరు జనసేన నాయకులు అంకిశెట్టిమణి, ఉత్తరాధి శివకుమార్, కళ్యాణ్ ఇతర నాయకుల సమక్షంలో జనసేన పార్టీ కువైట్ సభ్యులు, కొట్టేశ్రీహరి, బల్లేపల్లిశ్రీనివాస్, అలి షేక్ సన్మానించడం జరిగింది.