వీరమహిళ కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

వైజాగ్ ఈస్ట్: విశాఖ తూర్పు నియోజకవర్గం, 20వ వార్డ్ లో వీరమహిళను కోల్పోయిన తల్లిని జనసేన నాయకులు అంజి బాబు పరామర్శించి.. వారి కుటుంబానికి ధైర్యాన్ని నింపి, జనసేన పార్టీ ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియజేశారు. అంజి బాబుతో పాటూ 20వ వార్డు ఇన్చార్జ్ సారణీదేవి, నాయకులు రాఘవరావు, వీరమహిళలు, తూర్పు నియోజకవర్గం నాయకులు, జనసైనికులు వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేశారు.