హోరు వానలోను జనంకోసం జనసేన మహా పాదయాత్రకు జనం నీరాజనం

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, వెలమపేట గ్రామంలో రాజానగరం, నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు వారి సతీమణి, ‘నా సేన కోసం నా వంతు’ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జనంకోసం జనసేన మహా పాదయాత్ర” 21వ రోజులో భాగంగా గురువారం వెలమపేట గ్రామంలో జరిగింది. జనసేన నాయకులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ… తుగ్లక్ పాలనతో రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేసిన ఈ వైసీపీ సర్కాన్ ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని, దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన విధానాలు ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్టా వేంకటేశ్వరరావు, బైలపూడి శ్రీను, సిరిపరపు రాంబాబు, శివ, చవితిన కిరణ్, చొక్కాకుల నారాయణ, పొదలపు రవీంద్ర, గడి దుర్గా ప్రసాద్, గడి అప్పన్న, గడి వినోద్, బోల్లం శివ, ముత్యాల హరీష్, పిండి వివేక్ మరియు వీర మహిళలు, నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.