బోనెల విజయ్ చంద్రకు అభినందనలు తెలిపిన జనసేన నాయకులు

పార్వతీపురం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్వతిపురం నియోజకవర్గంలో టిడిపి – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన బోనెల విజయ్ చంద్రని పార్వతీపురం మండలంలో వున్న ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా జనసేన పార్టీకి క్రియాశీలకంగా పని చేసే నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరు కూడా సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. విజయ్ చంద్రతో జనసేన నాయకులు మాట్లాడుతూ మా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం కావున మన పార్వతీపురం నియోజకవర్గంలో జనసేన- టిడిపి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినందుకు మా సంపూర్ణ మద్దతు మీకు తెలియజేస్తూ ఇకపై ఒకరినొకరు సహకరించుకొని పార్వతీపురం నియోజకవర్గంలో టిడిపి- జనసేన జెండా ఎగరవేద్దాము. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో మొదట గెలిచే స్థానంగా మన పార్వతిపురంన్ని నిలబెడద్దాము. వైసిపి విముక్తి ఆంధ్రప్రదేశ్ చూడాలంటే జనసేన -టీడీపీ సమిష్టిగా పని చేసి ఈ సైకో ముఖ్యమంత్రిని గద్దె దింపి, టిడిపి – జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాము. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షురాలు ఆగూరు మని, ఖాతా విశ్వేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, చిట్లు గణేష్, భాస్కర్, జనార్ధన్, నవీన్, కనకరాజు, తేజ, చంద్రశేఖర్, జగదీష్, సోమేశ్, మీన్నారావ్, బ్రిటిష్ కృప, ప్రశాంత్, లక్ష్మణ్, నూకరాజు, జంబాడ శంకర్, సాయి, కేశవరావు, నర్సింగ్, లక్ష్మీనారాయణ, పార్వతీపురం మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన జనసేన నాయకులు రావడం జరిగింది. అలానే పార్వతిపురం పట్టణ జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల రాజాన బాలు, బోనేల గోవిందమ్మ పాల్గొవడం జరిగింది.