మారిశెట్టి శ్రీనివాసరావుని పరామర్శించిన జనసేన నేతలు

సత్తెనపల్లి, కొన్ని రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల బెదిరింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన సత్తెనపల్లికి చెందిన జనసైనికుడు మారిశెట్టి శ్రీనివాసరావుని, వారి కుటుంబ సభ్యులని శుక్రవారం అమరావతి హాస్పిటల్లో రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు జనసేన జిల్లా నాయకులతో కలిసి పరామర్శించి బాధితుడి యోగ క్షేమాలు తెలుసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది.