అంగన్వాడిల దీక్ష విరమింపజేసిన జనసేన నాయకులు

తిరువూరు: తిరువూరులో గత 18 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెలో భాగంగా గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన అంగన్వాడీలకు శనివారం సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసిన తిరువూరు నియోజకవర్గ జనసేన నాయకులు.. కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గ నాయకులు ఉయ్యూరు జయప్రకాష్, తిరువూరు మండల అధ్యక్షుడు పర్సా పుల్లారావు, పసుపులేటి రవీంద్ర, బత్తుల వెంకటేశ్వరరావు తదితర జనసైనికులు పాల్గొన్నారు.