జనసేన ఆధ్వర్యంలో కూలింగ్ డిస్పెన్షరీ ఏర్పాటు

కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం జంక్షన్ లో జనసేన ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు వబ్బిన సత్తిబాబు, గొరపల్లి రవికుమార్, గొరపల్లి చినబాబు కూలింగ్ డిస్పెన్షరీ యంత్రాన్ని ప్రారంభించారు. చల్లని, వేడి నీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. చలివేంద్రం మొదటిరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. కొత్తవలస-పెందుర్తి మార్గంలో ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఉగాది సందర్భంగా పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామెళ్ల శివాజీ, జొన్నపల్లి సత్తిబాబు, నక్కరాజు సతీష్, గురజాడ వెంకటేష్, మళ్ల రాజు, శ్రీనివాస రాజు, దేశపాత్రునిపాలెం పంచాయతీ వార్డు మెంబర్ గొరపల్లి నాయుడు, నాయకులు గొర్లె శ్రీనివాసరావు, ముచ్చకర్ల శ్రీను, నక్క ప్రభాకర్, ఉగ్గిన సురేష్, ఇరోతి చిరంజీవి, పల్లెల సంతోష్, కరెడ్ల వరాజీ, సూరిశెట్టి అజయ్, కరెడ్ల రామకృష్ణ, వీర మహిళ వెంకటలక్ష్మి, జనసైనికులు పాల్గొన్నారు.