రావూరి చెన్నకేశవ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

తాడేపల్లిగూడెం: పెంటపాడు మండలం జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి కె.పెంటపాడు గ్రామం రావూరి చెన్నకేశవ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. గురువారం వారి యొక్క పెద్ద కార్యం కార్యక్రమానికి పాల్గొని వారికి నివాళులర్పించి ఆ కుటుంబానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ 100000(లక్ష రూపాయలు) ఆర్థిక సాయం చేశారు. మరియు నరసాపురం జనసేన నాయకులు చాగంటిమురళీకృష్ణ(చిన్న) 20000 రూపాయలు ఆ కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నకేశవ మృతి పార్టీకి తీరని లోటుని అలాగే ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండదండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, పుల్లా బాబి, కసిరెడ్డి మధులత, గుండుమోగుల సురేష్ మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, అడబాల మురళి, పెనుబోతుల సోమలమ్మ మరియు జన సైనికులు పాల్గొన్నారు.