ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల సమస్యలను ప్రశ్నించిన జనసేన

కాకినాడ, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ ముత్తా గోపాలకృష్ణ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి మన యువత – మన భవిత భారీ బహిరంగ సభ జనవరి 12వ తేదీన యువత సమస్యలపై గళమెత్తనున్న జనసేనాని పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మరియు రైతుల ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ పిఎసి సభ్యులు, జిల్లా జనసేన పార్టీ ఇంచార్జీలు జిల్లా కార్యవర్గ సభ్యులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.