మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు

ములకలపల్లి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ములకలపల్లి మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ వారు గత 22 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న కష్టాన్ని గుర్తించి వారికి గౌరవ వేతనం కల్పించి వారి న్యాయపరమైన డిమాండ్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. జిల్లా నాయకులు గరికే రాంబాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరు చేపట్టినటువంటి ఈ సమ్మెకు జిల్లా నాయకత్వం తరఫున మీకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీరు చేసే ప్రతి పోరాటంలో జనసేన పార్టీ జిల్లా నాయకత్వం మరియు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం మీకు అండదండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, మండల్ నాయకులు నాగరాజు నాయక్, ఎస్ కే జాన్ పాషా, బొక్క వెంకటేశ్వర్లు కుంజ పాపారావు, గ్రామ కమిటీ నాయకులు సాయి ప్రకాష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.