పవన్ కళ్యాణ్ పై వైసీపీ వ్యక్తిగత దాడిని ఖండిస్తూ.. పోలీసులకు జనసేన ఫిర్యాదు

మేడ్చల్ నియోజకవర్గం: జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనల మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై, వారి వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సోమవారం మేడ్చల్ నియోజకవర్గం, బోడుప్పల్ జనసేన పార్టీ అధ్యక్షులు వంగరి సాయికుమార్ ఆధ్వర్యంలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.