జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలకు జనసేన మద్దతు

  • ఏ.పి.యు.డబ్ల్యూ.జె ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలియజేసిన జనసేన నాయకులు

నంద్యాల నియోజకవర్గం: నంద్యాల జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులపై, పాత్రికేయులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేఖంగా, అక్రమ కేసులను నిరసిస్తూ జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (ఏ.పి.యు.డబ్ల్యూ.జె) ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఎదురుగా చేపట్టి న నిరాహార దీక్షలకు నంద్యాల జనసేన యువ నాయకులు కవల సోదరులు చందు, సుందర్, తదితర జనసేన నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేసారు.