జనసేన ప్రజా చైతన్య యాత్ర 41వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన ప్రజా చైతన్య యాత్ర 41వ రోజు కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో బాడంగి మండలం, ఆకులకట్ట గ్రామంలో బుధవారం గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి సమస్యలు తెలుసుకుని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాడంగి మండలం అధ్యక్షులు కొల్లి సురేంద్ర, ఉల్లి సంతోష్, సత్య, సత్యనారాయణ, రాము, అజయ్ ప్రసాద్, బాడంగి జనసైనికులు పాల్గొనడం జరిగింది.